దేశ వస్తు, సేవల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 4.6 శాతం పెరిగి 863.11 బిలియన్ డాలర్ల (రూ.82 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇవి జీవనకాల గరిష్ఠ స్థాయి కావడం విశేషం. 2024-25లో వస్తు, సేవల ఎగుమతులు 825.26 బి.డాలర్లుగా నమోదయ్యాయి.