ఫెమా కింద చేపట్టిన మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయడంతో, ఆటోమేటిక్ రూట్ కింద మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి 10 శాతం వరకు చైనా వాటా ఉన్న విదేశీ కంపెనీలను అనుమతించే నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. డీపీఐఐటీ 2020 ప్రెస్ నోట్ (పీఎన్) 3 సవరణలకు కేంద్ర మంత్రి వర్గం మార్చిలో ఆమోదం తెలిపింది.