విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి.. మొబైల్ స్క్రీన్ సమయాన్ని విజ్ఞానదాయకంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన గేమిఫైడ్ మ్యాథ్ లెర్నింగ్ యాప్ ‘మ్యాథ్జోరో’ అందుబాటులోకి వచ్చింది. దీన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చీఫ్ కోఆర్డినేషన్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్ దిల్లీలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కార్యాలయంలో 2026, మే 4న ఆవిష్కరించారు.