కోల్ ఇండియాలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

కోల్ ఇండియాలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) మైనింగ్‌ విభాగంలో గేట్‌-2025 స్కోర్‌ ఆధారంగా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌): మొత్తం 276 పోస్టులు

(యూజీ- 114; ఓబీసీ- 74; ఎస్సీ- 41; ఎస్టీ- 20; ఈడబ్ల్యూఎస్‌-27)

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ (బీఈ/బీటెక్‌) పూర్తి చేసి ఉండాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి. దీనితో పాటు గేట్‌-2025 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

వయో పరిమితి: ఏప్రిల్‌ 30 నాటికి 30 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు మించకూడదు. 

వేతనం: బేసిక్‌ పే నెలకు 60,000; ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.60,000- రూ.1,80,000 పే-స్కేల్ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: గేట్‌- 2025 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (IME) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1,180; ఎస్సీ/ఎస్టీ/కోల్ ఇండియా ఉద్యోగులకు: ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08.05.2026.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 07.06.2026.

Website:https://www.coalindia.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram